మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో ముగిసిన సమ్మె

అయితే కొత్త యూనియన్ ఏర్పాటుకు మాత్రం యాజమాన్యం ససేమిరా అంటోంది. దీంతో మారుతి యాజమాన్యం డిమాండ్కు కార్మికులు తలొగ్గక తప్పలేదు. కార్మికులు యాజమాన్యానికి మధ్య ఒప్పందంపై సంతకాలు అయ్యాయని, నేటి నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని హర్యానా కార్మిక శాఖ కార్యదర్శి షర్భన్ సింగ్ తెలిపారు. కాగా.. 13 రోజుల పాటు జరిగిన ఈ సమ్మె కారణంగా కంపెనీ సుమారు రూ. 570 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. ఈ సమయంలో కంపెనీ దాదాపు 11,400 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








