ఉగాది పండుగ సందర్భంగా మారుతి అందిస్తున్న ఆఫర్స్

సంస్థ అందిస్తున్న వివిధ మోడళ్లపై అదనపు రాయితీలను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచే ప్రారంభించామని, ఇది ఈ నెల 28న ముగుస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా తమ కార్లను కొనుగోళ్లు చేసే వినియోగదారులకు వివిధ మోడళ్లపై రూ. 35,000 నుంచి రూ. 50,000 డిస్కౌంట్ అందిస్తున్న కంపెనీ వివరించింది. ఆల్టో ఎఫ్8, వ్యాగన్-ఆర్ మోడళ్లపై రూ. 35,000, ఎస్టిలో కారుపై రూ. 45,000, ఏ-స్టార్ కారుపై రూ. 50,000, రిట్జ్ కారుపై రూ. 40,000 తగ్గింపును అందిస్తున్నామని తెలిపింది.
ఇవే కాకుండా.. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్కార్డ్ ఆఫర్ ఉంటుందని, ఇందులో ఎల్సీడీ టీవీ/ మైక్రోవేవ్/ డీజీక్యామ్/మారుతీ జన్యూన్ యాక్సెసరీల్లో ఏదో ఒకటి తప్పక గెల్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా.. ఈ ఆఫర్లతో పాటు ఓ బంపర్ ప్రైజ్ కింద వ్యాగన్-ఆర్ కారును గెలుచుకునే అవకాశం కూడా ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక రాయితీలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్న అదనపు ప్రయోజనాలుంటాయని, ఈ ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ వివిధ కంపెనీ షోరూమ్లు, వర్క్షాపులలో ఎక్స్ఛేంజ్ మేళాలు, ఇవాల్యూయేషన్ క్యాంపులు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








