హర్యానాలో మూడో ప్లాంటు ఏర్పాటుకు మారుతి సన్నాహాలు..!

వార్షికంగా ఆరు లక్షల కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో హర్యానాలోని రోహ్తక్లో దాదాపు 600 ఎకరాల స్థలంలో మారుతి తన మూడవ మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్లో ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 20 లక్షలకు పెంచుకునే విధంగా మౌలిక వసతులు కల్పిస్తామని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ ప్లాంటు ఎరెక్షన్ కోసం మారుతి 1000 కోట్ల రూపాయల వెచ్చించనుంది. ప్రస్తుతం గుర్గావ్, మానేసర్ ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 12 లక్షల యూనిట్లుగా ఉంది. అలాగే మనేసర్లో ఉన్న ప్లాంటు విస్తరణ పనులు 2013లోగా పూర్తికానుంది. ఇందుకోసం కంపెనీ రూ. 2,000 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించనుంది.


Click it and Unblock the Notifications








