రూ. 9,000 వరకూ ధరలు పెరిగిన మారుతి సుజుకి కార్లు

ప్రస్తుతం మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 15 మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 4, 2011 నుండి అమలులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మారుతి అందిస్తున్న ప్రారంభ మోడల్ మారుతి ఎమ్ 800 (ధర రూ. 1.97 లక్షలు) మొదలుకొని, కంపెనీ తాజాగా విడుదల చేసిన హైఎండ్ వేరియంట్ లగ్జరీ కారు కిజాషి (రూ. 17.5 లక్షల) వరకూ ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపనీ వివరించింది. కాగా.. ఈ ఏడాది మారుతి సుజుకి ధరలను ఇది వరుసగా రెండవసారి.
జనవరి 2011లో కూడా ఆల్టో కారు మినహా మిగిలిన అన్ని కార్ల ధరలను రూ. 8,000 వరకూ కంపెనీ పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాటా మోటార్స్ తమ ఉత్పత్తుల ధరలను ఈ నెల 1 నుంచి రూ. 36,000 వరకూ పెంచగా.. టొయోటా కిర్లోస్కర్ కంపెనీ తమ కార్ల ధరలను రూ. 20,000 వరకూ పెంచింది. వీరి బాటలోనే పయనించేందుకు హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా ధరల పెంపు యోచనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








