మారుతి సమ్మెను క్యాష్ చేసుకుంటున్న హ్యుందాయ్

గుర్గావ్ ప్లాంటులో మారుతి సుజుకి నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్మడవుతున్న ఆల్టో కారుతో సహా స్విఫ్ట్ డిజైర్, ఏ-స్టార్, మారుతి 800, ఆమ్నీ, ఈకో వంటి మోడళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాగా.. ఈ సమ్మె కారణంగా మారుతి సుజుకి ఉత్పత్తి నష్టపోతుండటంతో కొన్ని మోడళ్ల వెయింట్ పీరియడ్ గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా కొనుగోలుదారులు ఇతర పోటీదారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మారుతి అసహాయతను హ్యుందాయ్ క్యాష్ చేసుకుంటుంది.
మారుతి సుజుకి మానేసర్ కార్మికుల సమ్మె కారణంగా హ్యుందాయ్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికితోడు కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన చిన్న కారు హ్యుందాయ్ ఇయాన్కు మంచి స్పందన వస్తుందని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ ఆర్. సేతురామన్ తెలిపారు. హ్యుందాయ్ ఇయాన్ కారుకు ఇప్పటికే 5,000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చాయి. పెరుగుతున్న బుకింగ్ల కారణంగా తమ మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








