జిఎమ్లో ముగిసింది.. ఎమ్ఎస్ఐలో ప్రారంభమైంది..!

అయితే ఈ సమ్మె కారణంగా కంపెనీ ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే విషయాన్ని మాత్రం మారుతి సుజుకి యాజమాన్యం వెల్లడించలేదు. దాదాపపు 2,000 మంది కార్మికులు పని చేస్తున్న మానేసర్ ప్లాంట్లో ఇటీవలే కొత్తగా ఏర్పడిన ఉద్యోగ సంఘానికి కంపెనీ యాజమాన్యం సరైన గుర్తింపును ఇవ్వకపోతుండటం వల్లనే కార్మికులు సమ్మెకు దిగినట్లుగా భావిస్తున్నారు. మానేసర్ ప్లాంట్ ద్వారా కంపెనీ సాలీ 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా.. ఈ ప్లాంటు మరో రెండు కొత్త యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తుంది.


Click it and Unblock the Notifications








