చెన్నైలో మాసేరటి లగ్జరీ కారును సీజ్ చేసిన అధికారులు

Maserati
చెన్నయ్‌లోని ఓ వ్యాపారవేత్తకు సంబంధించిన ఫారిన్ లగ్జరీ కారు 'మాసేరటి'ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు చెన్నైలో సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ లగ్జరీ కారు విలువ సుమారు రూ. 1.75 కోట్లు ఉంటుందని, కానీ ముంబై పోర్టులో దీని విలువను తగ్గించి చూపారని అధికారులు వెల్లడించారు. ఆ కారును ఫోటో తీద్దామని టి నగర్‌లోని డిఆర్ఐ ఆఫీసుకు వెళ్లి విలేఖరులను అనుమతించకపోగా, ఆ కారు నెంబర్ ప్లేటును తీసేసి దాన్ని పూర్తిగా కప్పివేశారు. దీంతో ఈ కారుకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ కారును ఓ ఎన్ఆర్ఐ తమిళనాడులోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడికి బహుమతిగా ఇచ్చినట్లు గసుగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించేందుకు నిరాకరిస్తున్నారు.

ఇటలీలో తయారైన తెలుపు రంగు మాసేరటి కారును 2008లో ముంబై పోర్టులో దిగుమతి చేసుకున్నారు. తర్వాత అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించారు. అండర్‌వ్యాల్యూ చేసిన ఆ వాహనాన్ని ట్రేస్ చేయాల్సిందిగా అహ్మదాబాద్ అధికారులు తమను కోరారని, ఈ నేపథ్యంలో సోమవారం తమ ఇంటెలిజెన్స్ టీమ్ వెస్ట్ మాంబళంలో ఆ లగ్జరీ కారు సీజ్ చేశారని డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఈ కారుపై ఇంకా అదనంగా రూ. 60 లక్షల కస్టమ్ డ్యూటీని చెల్లించాలని ముంబై కస్టమ్స్ మరియు డిఆర్ఐ అధికారులు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Friday, June 24, 2011, 16:36 [IST]
English summary
Directorate of Revenue Intelligence (DRI) officials seized an imported Maserati car in Chennai. DRI officials said this car belonging to a businessman in Chennai and worth about Rs 1.75 crore, but it is undervalued at Mumbai port.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+