రాష్ట్రంలో అత్యాధునిక షోరూమ్‌ను ప్రారంభించి మెర్సిడెస్

Mercedes-Benz
రాష్ట్రంలో బెంజ్ కార్ల ప్రియులకు నిజంగానే ఇది శుభవార్త. విలాసవంతమైన కార్ల బ్రాండ్‌లో మెర్సిడెజ్‌ బెంజ్‌‌కు ఉన్న ప్రత్యేకత గురించే వేరే చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు బెంజ్ కార్లును మరింత చేరువ చేసేందుకు మెర్సిడెజ్‌ బెంజ్‌‌ కంపెనీ హైదరాబాద్‌లోని కావూరి హిల్స్‌ ప్రాంతంలోని మహవీర్‌ మోటార్స్‌లో 17,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో బెంజ్‌ కార్లకు సంబంధించిన ఉపకరణాలు, కస్టమర్‌ లాంజ్‌, మెర్సిడస్‌ కేఫ్‌ వంటి తదితర విభాగాలున్నాయని, ఈ కేంద్రం నుంచి సెకండ్స్‌ అమ్మకాలు కూడా సాగించేందుకు ఏర్పాట్లు చేశామని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌-సిఇఒ పీటర్‌ హౌనెగ్‌ వివరించారు.

గడచిన 125 సంవత్సరాలుగా అత్యుత్తమ వాహనాలను, సేవలను వినియోగదారులకు అందించేయడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని, ఈ షోరూమ్ ఏర్పాటుతో భారత్‌లో ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ షోరూమ్‌ల సంఖ్య 28 నగరాల్లో 57 టచ్‌ పాయింట్‌ కేంద్రాలకు పెరిగిందని ఆయన తెలిపారు. 2010 డిసెంబరు నాటికి భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ మొత్తం 30,000 వాహనాలను విక్రయించింది. ఈ సంస్థకు భారత్‌లో 38 శాతం మార్కెట్ వాటా ఉంది. 2010లో భారత్‌లో 80 శాతం వృద్ధిని సాధించి, 6,000 కార్లు విక్రయించామని హోనెగ్ తెలిపారు. పూనేలోని చాకన్ ప్లాంటులో రెండవ షిప్ట్‌ను ప్రారంభించామని, దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సాలీన 10,000 యూనిట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2011, 10:56 [IST]
English summary
Luxury car maker, Mercedes-Benz India today opened its new dealership in Hyderabad, taking the total number to 57 pan-India. With establishment of the facility at Hyderabad, Mercedes-Benz now enjoys a network spread across 28 cities with over 57 touch-points in India, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+