నీతా ట్రావెల్స్ నుంచి మెర్సిడెస్ బెంజ్కు భారీ ఆర్డర్

భద్రత, సౌకర్యం, నాణ్యత, నమ్మకత్వాలకు తమ సంస్థ కట్టుబడి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఉన్నతాదికారి ఒకరు వెల్లడించారు. ఈ డీల్ విలువ దాదాపు రూ. 32 కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా. సాధారణంగా 3-యాక్సిల్ బెంజ్ బస్సు ధర రూ. 95 లక్షలు గానూ, 2-యాక్సిల్ బస్సు ధర రూ. 76 లక్షలు ఉంటుంది. 125 ఏళ్ల చరిత్ర కలిగిన తమ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా బస్సుల తయారీలో అగ్రగామిగా ఉందని, విస్తృతమైన ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను కలిగి ఉన్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పీచర్ టి హానెగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








