స్వంత ఫైనాన్స్ సేవలను ప్రారంభించిన మెర్సిడెస్ బెంజ్

ప్రస్తుతం డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 40 దేశాలలో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భారత్లోని మెర్సిడెస్ బెంజ్ కార్ల కొనుగోలుదారులకు మరియు డీలర్లకు డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఫైనాన్స్, లీజింగ్ మరియు ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అందించనుంది. అలాగే, డైమ్లర్ ఇండియా అందిస్తున్న వాణిజ్య వాహనాలకు కూడా ఇదే విధమైన స్కీమ్లను అందించనుంది. 2012 నాటికి డైమ్లర్ ట్రక్ 'భారత్ బెంజ్' మార్కెట్లోకి రావచ్చని అంచనా. భారత్ బెంజ్ అమ్మకాల మద్దతు కోసం ఫైనాన్షియల్ సేవలను డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించనుంది.


Click it and Unblock the Notifications








