పన్నెండేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న మెర్సిడెస్కు క్లీన్చిట్

గడచిన 12 ఏళ్ల క్రితం ముంబైకు చెందిన మెరైన్ కంటైనర్ సర్వీసెస్ (ఇండియా) మెర్సిడెస్సై అనైతిక వ్యాపారానికి సంబంధించి వినియోగదారుల కోర్టులో దావా వేసింది. అయితే ఈ కేసును పరిశీలించిన జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమీషన్ (ఎన్సిడిఆర్సి) మెర్సిడెస్కు క్లీన్చిట్ ఇచ్చింది. మెరైన్ కంటైనర్ సర్వీసెస్ (ఇండియా) వాదనలు ఈ కమిషన్ తోసిపుచ్చింది. ఒక ఏడాది క్రితం కాలం చెల్లిపోయిన వాహనాలను మెర్సిడెస్ అప్గ్రేడ్ చేసి కొత్త వెర్షన్గా విడుదల చేసింది. అయితే అప్గ్రేడ్ చేసిన వాహనాలను విక్రయించడం అనైతిక వ్యాపారం కిందకు రాదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్సి జైన్, సభ్యుడు ఎస్కె నాయక్లతో కూడిని ఎన్సిడిఆర్సి ధర్మాసనం తీర్మానం ఇచ్చింది.


Click it and Unblock the Notifications








