న్యూఢిల్లీకి వెళ్లనున్న ఫోర్డ్ ఇండియా ప్రధాన కార్యాలయం

Ford Car
ఫోర్డ్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని (హెడ్ క్వార్టర్స్) త్వరలోనే న్యూఢిల్లీకి మార్చనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. "ఫోర్డ్ ఇండియా హెడ్ క్వార్టర్స్‌ న్యూఢిల్లీకి తరలించబడుతుంది మరియు పశ్చిమం (గుజరాత్)లో ఓ కొత్త ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. ఇది భారత్‌లోని మా విస్తరణ ప్రణాళికలో భాగమ"ని ఫోర్డ్ ఆసియా పసిఫిక్ అండ్ ఆఫ్రికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్. హెన్రిచ్స్ వెల్లడించారు. రూ. 4,000 కోట్ల పెట్టుబడులతో గుజరాత్‌లోని సనంద్‌లో ఓ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర సర్కారుతో ఫోర్డ్ ఇండియా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌లో దాదాపు 5,000 మందికి ఉపాధి లభించనుంది. అమెరికాకు చెందిన ఫోర్డ్ గడచిన రెండేళ్లలో తన భారత మార్కెట్ వాటాను మూడింతలకు పెంచుకుంది. 2009లో 1 శాతంగా ఉన్న కంపెనీ మార్కెట్ వాటా ఇప్పడు దాదాపు 3 శాతానికి పెరిగింది. కాగా.. ఈ దశాబ్ధపు మధ్య కాలం నాటికి ఎనిమిది కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నామని, భారత్‌లో చిన్న కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్నందు వల్ల ఈ మోడళ్లలో ఎక్కువగా ఫిగో రేంజ్ కార్లే ఉంటాయని ఆయన తెలిపారు. భారత్‌లో 70 శాతం కార్ల అమ్మకాలు చిన్న కార్ల సెగ్మెంట్ నుంచే వస్తున్నాయని హెన్రిచ్స్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Friday, July 29, 2011, 17:04 [IST]
English summary
Ford India is planning to shift its headquarters to New Delhi soon, Company senior official said. “Ford India headquarters will be shifted to New Delhi and a new manufacturing plant will come up in West (Gujarat). This is part of our new India operations plan.” Ford Asia Pacific and Africa President, Mr Joseph R. Henrichs said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+