జేఎల్ఆర్ నుండి మరిన్ని మేడ్ ఇన్ ఇండియా కార్లు

Jaguar Land Rover
టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటీష్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), భారత్‌లో అసెంబ్లింగ్ కార్యకలాపాలను విస్తృతం చేయనుంది. మరిన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత లగ్జరీ కార్ మార్కెట్లో 20 శాతం వాటాను దక్కించుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

ప్రస్తుతం జేఎల్ఆర్‌కు చెందిన ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ ఎస్‌యూవీని టాటా మోటార్స్ భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తుంది. మరిన్ని ఇతర ల్యాండ్ రోవర్ ఉత్పత్తులతో జాగ్వార్ బ్రాండ్ మోడళ్లను కూడా భారత్‌లోనే అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తున్నామని జాగ్వార్‌ లాండ్‌ రోడర్‌ (జేఎల్‌ఆర్‌) ఇండియా హెడ్‌ (ప్రీమియర్‌ కారు డివిజన్‌) హెడ్‌ రోహిత్‌ సూరి తెలిపారు.

గడచిన మే నెలలో భారత్‌లో జేఎల్ఆర్ తమ తొలి అసెంబ్లింగ్ ప్లాంటును పూణేలో ప్రారంభించింది. ఈ ప్లాంటులో కంపెనీ అందిస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ల్యాండ్ రోవర్ 'ఫ్రీల్యాండర్ 2'ను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) యూనిట్లుగా బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో ఉన్న హాలేవుడ్ ఉత్పత్తి కేంద్రం నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, November 19, 2011, 15:02 [IST]
English summary
Tata Motors-owned British luxury car brand Jaguar Land Rover is evaluating options to assemble more models in India, including the Jaguar cars, as it aims at garnering about 20 per cent share of the luxury segment.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+