ఉద్యోగి-సూపర్వైజర్ గొడవ: ఎమ్ఆర్ఎఫ్ ఫ్యాక్టరీ లాకౌట్

ఆ ఉద్యోగి సూపర్వైజర్ అనుమతి తీసుకోకుండా సెలవు పెట్టడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. సెలవుమీద వెళ్లిన ఉద్యోగి తిరిగి ఫ్యాక్టరీకి వస్తే అతడిని విధుల్లోకి అనుమతించలేదని, దాంతో సదరు ఉద్యోగి మద్దతు తెలుపుతూ ఇతర కార్మికులు విధుల బహిష్కరించడంతో లాకౌట్ను ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.
కొట్టాయం ప్లాంటులో గత నాలుగు రోజలుగా పనులు నిలిచిపోయాయి. ఫలితంగా కంపెనీ సుమారు రూ. 22 కోట్ల మేర నష్టం వాటిల్లిన్నట్లు తెలుస్తుంది. ఈ ప్లాంటులో మూడు పనివేళల్లో (షిఫ్ట్లలో) మొత్తం 1,350 మంది కార్మికులు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications








