మారుతి గుజరాత్ రాకను స్వాగతించిన నరేంద్ర మోడి

Narendra Modi
భారతదేశపు నెంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం గుజరాత్ రాష్ట్రాన్ని ఎన్నుకుంది. కాగా.. మారుతి సుజుకి తమ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి వెల్లడించారు. ఇది గుజరాత్ రాష్ట్ర ఆటోమొబైల్ రంగం యొక్క వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

"గుజరాత్‌కు రావాలన్న మారుతి సుజుకి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆసియా ఆటో హబ్‌గా గుజరాత్ వేగంగా వృద్ధి చెందుతోంది. మారుతితో ఈ వేగం మరింత పుంజుకుంటుంద"ని మోడి తన ట్విట్టర్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. "ఇది కొత్త సంవత్సరం సందర్భంగా గుజరాత్‌కు మారుతి సుజుకి అందిస్తున్న బహుమతి" అని నరేంద్ర మోడి పేర్కొన్నారు.

మారుతి సుజుకి తన వెండర్లతో కలిపి రూ.18,000 కోట్లను గుజరాత్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త ప్లాంటుపై వెచ్చించనుంది. తమ ప్లాంటు కోసం 500 ఎకరాల భూమిని, అలాగే తమ వెండర్ల కోసం మరో 500 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా మారుతి సుజుకి గుజరాత్ సర్కారను కోరింది. మానేసర్ కార్మికుల ఆందోళనతో విసిగెత్తిన మారుతి తమ ప్లాంటు కోసం అన్ని విధాలైన అనువైన గుజరాత్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, October 31, 2011, 15:03 [IST]
English summary
Gujarat Chief Minister Narendra Modi welcomed Maruti Suzuki's decision to set up a plant in the state. "I welcome Maruti Suzuki's decision to come to Gujarat. Gujarat is moving ahead fast as Asia's auto hub. With Maruti, the pace will accelerate," Modi said on twitter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+