నిస్సాన్-అశోక్ లేల్యాండ్లను లైట్ వెయిట్ ట్రక్స్..!

ఈ ప్రాజెక్టు కోసం ఇరు కంపెనీలు మరో 3-4 ఏళ్ల పాటు రూ. 1,100 కోట్ల నుంచి రూ. 1,200 కోట్ల మేర పెట్టుబడులు వెచ్చించనున్నట్లు సమాచారం. అశోక్ లైలాండ్కు హోసూర్లో ఉన్న ప్లాంటులో ఏడాదికి లక్ష వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. శ్రీపెరంబూర్లో కంపెనీ నిర్మిస్తున్న ప్లాంటు నిర్వహణలోకి వచ్చినట్లయితే ఈ ఉత్పత్తి సామర్థ్యం 1,90,000 యూనిట్లకు పెరగవచ్చునని కంపెనీ భావిస్తోంది. దీని తర్వాత గ్రీన్ఫీల్డ్లో మరో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. 380 ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్లాంటుకు స్థాపన కోసం తమిళనాడు సర్కారు ఆమోదం గురించి వేచిచూస్తున్నామని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications








