మైక్రా ధరను రూ. 11,170 మేర పెంచిన నిస్సాన్ మోటార్ ఇండియా

Nissan Micra
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కార్పోరేషన్ భారతీయ అనుబంధ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా పూర్తిగా భారత్‌లో తయారు చేసిన తమ చిన్న కారు "మైక్రా" ధరను రూ. 11,170 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పాదక వ్యయం పెరిగిన కారణంగా ధరలను పెంచక తప్పడం లేదని, పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెట్రోల్, డిజీల్ వేరియంట్లను బట్టి ఈ పెంపు రూ. 2,500 (0.5%) నుంచి రూ. 11,170 (2%) మేర ఉంటుందని నిస్సాన్ పేర్కొంది.

ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్ నిస్సాన్ మైక్రా కారు ధర రూ. 4.06 లక్షల నుంచి రూ. 4.36 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ వేరియంట్ ధర రూ. 5.59 లక్షల నుంచి 6.05 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. కాగా.. కంపెనీ దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తున్న ఎస్‌యూవీ ఎక్స్-ట్రైల్, లగ్జరీ సెడాన్ టీనా, స్పోర్ట్స్ కారు 370జెడ్ మోడల్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచింది.

ఇప్పటికే దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అన్ని మోడళ్లపై రూ. 9,000 మేర పెంచగా, మహీంద్రా అండ్ మహీంద్రా రూ. 15,000 మేర పెంచిన సంగతి తెలిసిందే. అలాగే టాటా మోటార్స్ కూడా ప్యాసింజర్ వాహనాలపై ధరలను రూ. 36,000 మేర పెంచగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ధరల పెంపు విషయాన్ని పరిశీలిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 12, 2011, 11:27 [IST]
English summary
Japan's leading car maker Nissan Motor India hiked prices of its small car Micra by up to Rs 11,170 with immediate effect. The hike will be applicable to both petrol and diesel versions and will be in the range of Rs 2,500 to Rs 11,170 the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+