టొయోటా ఇన్నోవాకు పోటీగా ఎమ్యూవీ: నిస్సాన్ మోటార్

మైక్రాను తయారు చేసిన ఫ్లాట్ఫామ్ ఆధారంగానే ఈ సెడాన్ను రూపొందిస్తామని, తొలుత దీనిని చైనాలో విడుదల చేస్తామని, భారత్ కోసం ఈ సెడాన్ కారును చైనా ప్లాంటులో ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పారు. యూరప్, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు 1.1 లక్షల మైక్రా కార్లను ఎగమతి చేయగలమని ఆయన అంచనా వేశారు. గత అక్టోబర్ నెలలో మైక్రా ఎగుమతులను ప్రారంభించిన నిస్సాన్ ఇప్పటి వరకూ 55,000 కార్లను ఎగుమతి చేసినట్లు ఆయన వివరించారు.
కాగా.. హైదరాబాద్లోని ఎస్పీ రోడ్లో కంపెనీ కొత్తగా "ఫార్చూన్ నిస్సాన్ షోరూం"ను ప్రారంభించింది. భవిష్యత్తులో చెన్నై ప్లాంటులో తయారయ్యే సెడాన్ కార్లను కూడా ఎగుమతి చేయనున్నామని, అలాగే మరో చిన్న కారును కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని నిస్సాన్ తెలిపింది. పూర్తిగా భారతదేశంలో తయారైన చిన్న కారు నిస్సాన్ మైక్రాను గత జూలైలో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ భారత్లో మొత్తం 13,000 మైక్రా కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాలీనా రెండు లక్షల యూనిట్లుగా ఉన్న చెన్నయ్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని నాలుగు 4 లక్షల యూనిట్లకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








