మొదటి లక్ష మైక్రా కార్ల ఉత్పత్తిని పూర్తి చేసిన నిస్సాన్

Nissan Micra
జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లో మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. గతేడాది మార్కెట్లోకి విడుదల చేసిన తమ చిన్న కారు మైక్రాను కేవలం 13 నెలల్లోనే నిస్సాన్ లక్ష కార్లను ఉత్పత్తి చేసింది. మే 2010లో నిస్సాన్ కంపెనీ చెన్నయ్ ప్లాంటులో తమ భాగస్వామి, ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రీనాల్ట్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడి మైక్రా ఉత్పత్తి ప్రారంభించింది. భారత్‌లోనే కాక విదేశాల్లో కూడా ఈ కారు డిమాండు భారీగా ఏర్పడటంతో కంపెనీ ఉత్పత్తిని వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో తొలుత 1,500 మందితో ప్రారంభించిన ప్లాంటులో ఇప్పుడు దాదాపు 4,000 మంది పనిచేస్తున్నారు.

ఈ ప్లాంటు స్థాపన కోసం కంపెనీ రూ. 4,500 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించింది. గత జులైలో భారత మార్కెట్లో ప్రవేశించిన నిస్సాన్ ఇప్పటి వరకూ 15,000కు పైగా కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లోనే కాకుండా థాయ్‌లాండ్, మెక్సికో మరియు చైనా దేశాల్లో కూడా మైక్రా కారును నిస్సాన్ ఉత్పత్తి చేస్తుంది. కాగా.. భారత్‌లో తయారైన మైక్రా కార్లు ఎక్కువ భాగం విదేశాలకే ఎగుమతి అవుతాయి. ఈ ఏడాదిలో నిస్సాన్ ఓ గ్లోబల్ సెడాన్ కారును భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అంతేకాకుండా ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్‌తో కూడా జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఓ వాణిజ్య వాహనాన్ని ఉత్పత్తి చేయనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2011, 17:48 [IST]
English summary
Japanese carmaker Nissan produced its 100,000th Micra car today, in 13 months after its first started production in May 2010.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+