భారత్లో ఎక్స్-ట్రైల్ స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసిన నిస్సాన్

సరే, ఇదంతా అటుంచితే.. ఈ రియాల్టీ షో సందర్భాన్ని పురస్కరించుకొని నిస్సాన్ దేశీయ విపణిలో సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్లో అందిస్తున్న ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) "ఎక్స్-ట్రైల్"లో ఓ సరికొత్త ఎక్స్-ట్రీమ్ ట్రైల్ లిమిటెడ్ ఎడిషన్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశీయ విపణిలో లభ్యమవుతున్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్యూవీ కన్నా పది అదనపు ఫీచర్లు ఇందులో లభ్యం కానున్నాయి.
నిస్సాన్స్ ఎక్స్-ట్రైల్ ఎక్స్-ట్రీమ్ లిమిటెడ్ ఎడిషన్లో లభ్యమయ్యే అదనపు ఫీచర్లు:
* టచ్ స్క్రీన్ నేవిగేషన్ సిస్టమ్
* రియర్ స్పాయిలర్
* ఎక్స్-ట్రీమ్ ట్రైల్ డెకాల్ (స్టిక్కర్)
* ఎక్స్-ట్రీమ్ ట్రైల్ డోర్ విజర్ సెట్
* రియర్ స్కఫ్ ప్లేట్
* కార్గో డ్రాయర్
* కికింగ్ ప్లేట్ విత్ ఎల్ఈడి
* సైడ్ మౌల్డింగ్
* ఫ్లోర్ మ్యాట్స్
* రియర్ బంపర ప్రొటెక్టర్
దేశీయ విపణిలో నిస్సాన్స్ ఎక్స్-ట్రైల్ ఎక్స్-ట్రీమ్ లిమిటెడ్ ఎడిషన్ (ఎల్ఈ గ్రేడ్) ధర రూ.22,78,928 (ఎక్స్-షోరూమ్ ముంబై)గా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








