మహీంద్రా ఎక్స్యూవీ500 టాప్-ఎండ్ బుకింగ్స్ నిలిపివేత!

కాగా.. ఎక్స్యూవీ500 డబ్ల్యూ6, ఎక్స్యూవీ500 డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్)ల బుకింగ్లు మాత్రం యధావిథిగా కొనసాగుతున్నాయని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీకు అశేష ఆదరణ లభించడానికి ప్రధానం కారణం, ఈ మోడల్ ధరే. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
* ఎక్స్యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
* ఎక్స్యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
* ఎక్స్యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
ఎక్స్యూవీ500 ఎస్యూవీ డిమాండ్ను ముందుగానే ఊహించిన మహీంద్రా, ఈ మోడల్ను విడుదల చేయడానికి ముందే కొంత స్టాక్ను కూడా సిద్ధం చేసుకుంది. అయితే, భారత మార్కెట్ నుంచి ఊహించిన దాని కన్నా అధికంగా డిమాండ్ వస్తుండటంతో కంపెనీ తాక్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీకు 5000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్స్యూవీ500 ఎస్యూవీ విడుదల మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహీంద్రాకు ప్రతి నెలా 2,000 ఎక్స్యూవీ500 ఎస్యూవీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. మరికొద్ది నెలల్లోనే దీన్ని 3,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ సిస్టమ్తో లభిస్తుంది.
ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్ను ఉపయోగించారు. ఇది సుమారు 140 బిహెచ్పిల శక్తిని, 33 కెజిఎమ్ల టార్క్ను విడుదల చేస్తుంది. ఎల్ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్యూవీ500 ఎస్యూవీ సొంతం.


Click it and Unblock the Notifications








