వర్కర్ల డిమాండ్లను అంగీకరించే ప్రశ్నే లేదు: మారుతి సుజుకి

యూనియన్ రిజిస్టర్ కాకుండానే, ప్రస్తుత పరిస్థితుల్లో వారి డిమాండ్లను ఎలా అంగీకరిస్తామని ఆయన ప్రశ్నించారు. సమ్మె కారణంగా ఐదో రోజు కూడా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దాదాపు 2,000 మంది వర్కర్లు గత శనివారం నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకూ కంపెనీ సుమారు 3,000 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎమ్ఎస్ఈయూ (మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్)ను యాజమాన్యం గుర్తించాలనేది వారి ప్రధాన డిమాండ్.
మానేసర్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో రెండు యూనిట్లలో కూడా కాంట్రాక్టు లేబర్ను కొనసాగించాలని వారి మరో డిమాండ్. ప్రస్తుతం మానేసర్ ప్లాంటులో మారుతి ఉద్యోగ్ కామ్గర్ యోజన (ఎమ్యూకెయూ) అనే యూనియన్ ఉంది. అయితే ఈ యూనియన్లో ఎక్కువగా గుర్గావ్ యూనిట్కు చెందిన వర్కర్లే ఉన్నారు. దీంతో తమ కొత్త యూనియన్ను అంగీరించి తీరాల్సిందేనని మానేసర్ కార్మికులు, అంగీకరించే ప్రశ్నే లేదని యాజమాన్యం మొండి పట్టు పడుతున్నాయి. ఫలితంగా కంపెనీకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.


Click it and Unblock the Notifications








