గుర్గావ్-మానేసర్ బెల్ట్లోని 65 ఫ్యాక్టరీల్లో 2 గంటల పాటు సమ్మె

మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించండతో పాటు ఉద్యోగం నుంచి తొలగించిన 11 మంది తొటి కార్మికులను తిరిగి పనిలోకి తీసుకొంటామని, యాజమాన్యం వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకొని వ్రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని కార్మికులు పట్టుబట్టి మానేసర్ ప్లాంటు ముందు బైఠాయించారు.
యాజమాన్యం మాత్రం కార్మికుల డిమాండ్లకు ససేమిరా అంటోంది. మారుతి సుజుకిలో సాధారణంగా సమ్మెలు రావు, వస్తే అవి అషామాషీగా సాగవు. గతంలో కూడా మారుతి సుజుకి ఏకంగా మూడు నెలల పాటు సమ్మె జరిగిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








