బెంజ్ బాటలోనే బిఎమ్డబ్ల్యూ: అతి త్వరలో కార్ లీజింగ్ బిజినెస్

భారత మార్కెట్లో తాము కూడా లీజు పద్దతి ప్రకారం తమ కార్లను వినియోగదారులకు అందించాలని బిఎమ్డబ్ల్యూ యోచిస్తోంది. దీనిపై బిఎమ్డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ మాట్లాడుతూ.. "భారత్లో లీజింగ్ పద్ధతిని పరిచయం చేసిన తొలి కంపెనీగా బిఎమ్డబ్ల్యూ అతరించనుంద"ని చెప్పారు.
అయితే, ఇందుకు సంబంధించిన ఖచ్ఛితమైన సమయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్లో ఈ విధాన్ని ఎప్పుడు పరిచయం చేస్తారన్న ప్రశ్నకు ఆయన "అతి త్వరలో" అని సమాధానం ఇచ్చారు. భారత లగ్జరీ కార్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్కు, బిఎమ్డబ్ల్యూకి మధ్య మంచి పోటీ వాతారణ ఉన్న సంగతి తెలిసిందే.
దశాబ్ధాలుగా భారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ను బిఎమ్డబ్ల్యూ ఇటీవలే అధిగమించి ప్రధమ స్థానాన్ని చేజిక్కుంచుంది. ఈ నేపథ్యంలో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు తమ ప్రత్యర్థి (మెర్సిడెస్ బెంజ్) కన్నా ముందుగా తామే లీజింగ్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








