ఇంధన ధరల పెంపుతో కార్ల డిమాండ్ తగ్గుతుంది: ఆటో కంపెనీలు

ఇదిలా ఉండగా ఒక్కసారిగా ఇంత మొత్తంలో ఇంధన ధలను పెంచితే కార్ల అమ్మకాలు మరింత మందగించే అవకాశం ఉందని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రుణాలపై పెరిగిన వడ్డీరేట్లు పరిశ్రమలను గక్కతిప్పుకోనికుండా చేస్తుంటే, తాజా పెంపు తమపై మరింత భారంగా మారే అవకాశం ఉందని కంపెనీలు భయపడుతున్నాయి. 'ఇప్పటికే గత నెలలో కార్ల అమ్మకాల వృద్ధిరేటు తగ్గింది. దీనికి అధిక వడ్డీరేట్లు కారణం. తాజాగా పెట్రోల్ ధరలు పెరిగాయి. దీని ప్రభావం ప్రధానంగా స్వల్ప కాలానికి కార్ల గిరాకీపై ఉంటుంది' అని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) డైరెక్టర్ జనరల్ విష్ణు మాథూర్ తెలిపారు. 22 నెలల్లో అత్యంత తక్కువగా ఏప్రిల్ నెలకు కార్ల అమ్మకాల్లో వృద్ధిరేటు 13.18 శాతానికి పరిమితమైంది.
దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయిన మారుతి సుజుకి ఇండియా కూడా.. ఇదే స్థాయిలో ఇంధన ధరలు పెరిగినట్లయితే కార్ల పరిశ్రమలు భారీ ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉందని కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. పెట్రోల్ ధరను లీటరుపై రూ. 5 పెంచడం చాలా ఎక్కువని, ఇప్పటికే సెంటిమెంట్ బలహీనంగా ఉందని, ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఈ సెంటిమెంట్ మరింత బలహీన పడుతుందని దేశీయ రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) అరవింద్ సక్సేనా తెలిపారు. కాగా.. ఈ పరిణామాలు కార్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండేలా చేస్తుందని జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్వ్యాగన్ గ్రూప్ సేల్స్ ఇండియా బోర్డు సభ్యుడు నీరజ్ గార్గ్ అన్నారు. రానున్న ఒకటి రెండు నెలల్లో కార్లకు భారీగా గిరాకీ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








