Just In
- 1 hr ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 3 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 5 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Movies లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఎపి లేక టిఎన్: ప్లాంటు ఏర్పాటుపై పియోజియోట్ అయోమయం
వార్షికంగా 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ ప్లాంటు ప్రారంభమైతే.. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందుకోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్లాంటును దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ఫ్రాన్స్ కంపెనీను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం గతంలో ఎకరా స్థలం రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు తమిళనాడులో ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆ ప్రభుత్వం ఇచ్చే రాయితీలను బట్టి ఈ ప్రాజెక్టు విషయాన్ని ఫైనలైజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. జూన్ 2011 నాటికి ఈ ప్లాంటు ఏర్పాటుపై ఓ స్పషమైన నిర్ణయాన్ని తీసుకుంటామని కంపెనీ అధికారులు వెల్లడించారు. తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తడ ప్రాంతాన్ని, తమిళనాడులో నోకియా ప్లాంటుకు సమీపంలో ఉన్న వల్లమ్ ప్రాంతాలను కంపెనీ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా.. మౌలిక అవసరాల దృష్ట్యా చెన్నయ్ మెరుగ్గా ఉండటంతో పాటు ఇటీవలే ఆటోమొబైల్ హబ్గా అవతరించడంతో కంపెనీ ఎక్కువభాగం తమిళనాడు వైపే మొగ్గు చూపవచ్చునని, అలాగే.. ఆంధ్రప్రదేశ్ సర్కారు అందిస్తున్న రాయితీలను కూడా కంపెనీ పరిగణలోకి తీసుకునే అకాశాలు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు విషయం తేలాలంటే జూన్ వరకూ ఆగాల్సిందే మరి.