గుజరాత్ సర్కారుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్యూజో

ఈ మేరకు ప్యూజో కంపెనీ గుజరాత్ సర్కారుతో ఓ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గుజరాత్లోని పారిశ్రామిక ప్రాంతమైన సనంద్లో రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ప్యూజో తమ తొలి నూతన ప్లాంటును భారత్లో ఏర్పాటు చేయనుంది. గుజరాత్ ప్రపంచ ఆటోమొబైల్ తయారీ హబ్గా ఎదుగలదని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.
ఆటోమొబైల్ విడిభాగాల తయారీ మరియు ఎగుమతుల్లో కూడా సనంద్ మేజర్ హబ్గా ఎదుగుతోందని నరేంద్ర మోడీ అన్నారు. సుమారు 584 ఎకరాల స్థలంలో, ప్రారంభ దశలో భాగంగా సాలీనా 1,65,000 వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్లాంటు ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగానూ 25,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్ణయించగా, 2013 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








