మహీంద్రా రేవాకు ధీటుగా పోలారిస్ ఎలక్ట్రిక్ వాహనాలు

Polaris EV
అమెరికాకు చెందిన ఆఫ్-రోడ్ వాహనాల తయారీ సంస్థ పోలారిస్, భారత్‌లో మహీంద్రా రేవాకు పోటీగా తమ స్వంత ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అమెరికన్ కార్‌మేకర్ క్రిస్లర్ నుంచి పోలారిస్ స్వాధీనం చేసుకున్న గ్లోబల్ ఎలక్ట్రిక్ మోటార్‌కార్స్ (జిఈఎమ్) ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలని పోలారిస్ సన్నాహాలు చేస్తుంది.

జిఈఎమ్‌లో తమకు మంచి ప్యాసింజర్, వాణిజ్య ఉపయోగార్థం ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని, ఈ వాహనాలను భారత్‌లో విడుదల చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే ఓ మార్కెట్ అధ్యయాన్ని ప్రారంభిస్తామని పోలారిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే తెలిపారు. ప్రస్తుతం జిఈఎమ్ వద్ద మూడు ఎలక్ట్రిక్ కార్లు, మూడు వాణిజ్య వాహనాలు ఉన్నాయి.

జీఈఎమ్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.3.7 లక్షల నుండి రూ.6.52 లక్షల మధ్య ఉండగా, వాణిజ్య వాహనాల ధరలు రూ.4.28 లక్షల నుండి రూ.5.80 లక్షల మధ్య ఉన్నాయి. ఈ వాహనాలు గంటకు 50 కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి. పోలారిస్ ఇటీవలే భారత మార్కెట్లోకి తమ ఆఫ్-రోడ్ వాహనాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో తమ డీలర్‌షిప్‌లను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.

Article Published On: Friday, September 30, 2011, 14:20 [IST]
English summary
Polaris, the American off-roader manufacturer is all set to launch its own electric vehicles in India to challenge Mahindra Reva. Polaris is planning to launch electric vehicles through Global Electric Motorcars (GEM ) an company it bought from American carmaker Chrysler.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+