ఈ ఏడాది భారత్కు రానున్న 500 పోర్షే కార్లు

ప్రస్తుతం భారత్లోని ప్రిసిషన్ కార్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా పోర్షే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారత్లోని పోర్షే కార్లకు ప్రిసిషన్ కార్స్ ఒక అధికారిక దిగుమతిదారు మరియు పంపణీదారు కూడా. భారత్లో పోర్షే అందిస్తున్న కెయిన్ ఎస్యూవీ కారును పొందాలంటే కనీసం 500 రోజుల సమయం పడుతుంది. ఇతర స్పోర్ట్స్ కార్ మోడళ్లకయితే 100 రోజుల డెలవరీ సమయం పడుతుందని ప్రిసిషన్ కార్స్ తెలిపింది. పోర్షేకు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్ష కార్ల డిమాండ్ ఉంటుంది.
ఈ కార్లను జర్మనీలోని ఉత్పత్తి కేంద్రంలో పోర్షే తయారు చేస్తుంది. ప్రపంచ మార్కెట్ల నుంచి పోర్షేకు 74,000 యూనిట్ల డిమాండ్ వస్తుంటే.. కంపెనీ ఉత్పత్తి మాత్రం 44,000 యూనిట్లుగా ఉంది. దీన్నిబట్టి పోర్షే బ్రాండ్కు ఉన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం న్యూఢిల్లీ ద్వారా పోర్షే తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కాగా.. తమ వ్యాపార విస్తరణలో భాగంగా బెంగుళూరు, ఛండీఘడ్, అహ్మదాబాద్, కొచ్చిలలో తమ నెట్వర్క్ను విస్తరించుకున్ అంశంపై కంపెనీ దృష్టిసారిస్తోంది.


Click it and Unblock the Notifications








