జయలలిత సర్కారుతో ప్యూజో సిట్రాన్ అధికారుల భేటీ!

Jayalalitha
గత పదేళ్ల క్రితం భారత ఆటోమొబైల్ మార్కెట్‌ నుంచి వైదొలగిన ఫ్రెంచ్‌కు చెందిన రెండవ అతిపెద్ద కార్ల తయూరీ సంస్థ పీఎస్‌ఏ ప్యూజో సిట్రాన్ తిరిగి భారత్‌లోకి ప్రవేశించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, సంస్థ కేవలం తమ ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టడమే కాకుండా.. భారత్‌లోనే స్వతాహాగా వాటిని ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటు చేస్తే లబ్ధిదాయకంగా ఉంటుదనే అంశంపై కంపెనీ మార్కెట్ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు తమిళనాడు ప్రాంతాలలో స్థాలాల కోసం కంపెనీ అన్వేషిస్తుండగా, తాజాగా.. వచ్చే వారం తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ ఉన్నతాధికారుల బృందం భేటీ కానుంది.

గతంలో తమిళనాడులో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ భావించినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కరుణానిధి ప్రభుత్వంతో తమ రాయబారాన్ని కంపెనీ విరమించుకుంది. ప్రస్తుతం తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో, ప్యూజో చర్చలకు సిద్ధమైంది. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతుండటం, అన్ని రకాల రవాణా సదుపాయాలను కలిగి ఉండటంతో ప్యూజో వీలైనంత వరకూ ఆ రాష్ట్రంలోనే ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇది ప్యూజో కంపెనీకు జయలలిత ప్రభుత్వం ప్రకటించే రాయితీలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతో ప్యూజో ఉన్నతాధికారుల భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 28, 2011, 11:59 [IST]
English summary
PSA Peugeot Citroen, the second largest French automobile company is entering the Indian automobile market for a second innings and the company will have its first plant in South. It is said that a senior delegation from PSA Peugeot Citroen is expected to meet the Tamil Nadu government next week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+