మొన్న జయ, నిన్న మోడి: ప్యూజో అధికారుల రాయబారాలు

Jayalalitha
తమిళనాడులోని శ్రీపెరంబూరులో ప్లాంటు ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామన్న ఫ్రెంచ్ కార్ల దిగ్గజం ప్యూజో, ఆ ప్రకటన వెలువడిన తర్వాత రోజే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడితో భేటి అయ్యింది. గురువారం పిఎస్ఏ ప్యూజో సిట్రాన్ ఉన్నతాధికారులు ప్లాంటు ఏర్పాటు విషయమై మోడితో సమావేశం అయ్యారు. భారత్‌లో తమ తొలి ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి ప్యూజో అన్నివిధాలుగా అనుకూలంగా ఉండే రాష్ట్రం కోసం అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎంచుకుంది.

ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్యూజో కంపెనీకు స్థలంపై భారీ రాయితీలను అందించడానికి సిద్ధంగా ఉంటే, తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతూ విదేశీ లగ్జరీ కార్ల కంపెనీలను ఆకర్షిస్తోంది. మరోవైపు గుజరాత్ సర్కారు అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు ఆటోమొబైల్ తయారీదారులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రాన్ని ఎన్నుకుంటే తమకు లబ్ధిదాయకంగా ఉంటుందనే అంశంపై కంపెనీ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది.

గడచిన దశాబ్ధం క్రితం మన దేశం వదలి వెళ్లిన ప్యూజో తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు ఈ ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం గజరాత్‌లో టాటా నానో ప్లాంటు నెలకొల్పిన సనంద్‌లో భూములను కంపెనీ పరిశీలించింది. చూస్తుంటే.. ఆటోమొబైల్ కంపెనీలన్నీ టాటా మోటార్స్‌ను ఆదర్శంగా తీసుకొని గుజరాత్‌కు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. గుజారత్‌లో ఇప్పటికే, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ కంపెనీలు ప్లాంట్లను కలిగి ఉండిగా.. మారుతు సుజుకి, ఫోర్డ్, హీరో హోండా కంపెనీలు కూడా ఈ రాష్ట్రంపైనే దృష్టి సారిస్తున్నాయి.

ఏదేమైనప్పటికీ.. మౌలిక సదుపాయాలు, రవాణా, విదేశీ ఎగుమతులకు తమిళనాడు రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉండటంతో ప్యూజో వీలైనంత వరకూ ఈ రాష్ట్రాన్ని ఎంచుకనే అవకాశాలు ఉన్నాయి. అయితే, తాజాగా గుజరాత్ సర్కారు కంపెనీ అధికారులు భేటీ కావడాన్ని బట్టి చూస్తే, మోడి సర్కారు ఇచ్చే రాయితీలను కంపెనీ తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ సందేహాలకు తెరపడాలంటే, ప్లాంటు ఏర్పాటుపై కంపెనీ ఖచ్ఛితమైన నిర్ణయాన్ని ప్రకటించే వరకూ వేచి చూడాల్సిందే మరి.

More from DriveSpark

Article Published On: Friday, July 1, 2011, 13:13 [IST]
English summary
Officials from PSA Peugeot Citroen, the French car major yesterday met Gujarat chief minister Narendra Modi in Gandhinagar on Thursday. This meeting has added to speculations over the French carmaker setting up its plant near Chennai in Tamil Nadu. There was an official confirmation from PSA about it investing Rs.4,000 crores in Sriperumbudur near Chennai, Tamil Nadu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+