'నానో' కోసం కదిలొచ్చిన రతన్ టాటా!

ఇందులోభాగంగానే శనివారం ఆయన విజయవాడలోని టాటా డీలర్ జాస్పర్ ఇండస్ట్రీస్కు వచ్చారు. జాస్పర్ కేవలం 14 రోజుల్లో 234 నానో కార్లు విక్రయించింది. ఈ సందర్భంగా నానో కొన్న వినియోగదారులకు స్వయంగా తాళాలు అందివ్వడానికి రతన్ టాటా విజయవాడ నగరానికి వచ్చారు. మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చిన ఆయనకు జాస్పర్ ఇండస్ట్రీస్ అధినేత బాడిగ రామకృష్ణ, ఆయన కుమారుడు సుమంత్లు ఘనస్వాగతం పలికారు. రతన్ దాదాపు మూడు గంటల పాటు విజయవాడలోనే గడిపారు.
ఈ సందర్భంగా నానో కొన్న 234 మంది వినియోగదారులను ఒక్కొక్కరిగా వేదికపైకి పిలిచి టాటా స్వయంగా కారు తాళాలు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ కారును సామాన్యుల కోసం తీసుకొచ్చామని, ఇది విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. జాస్పర్ ఇండస్ట్రీస్ను ఆయన అభినందించారు. జాస్పర్ ఇండస్ట్రీస్ అధినేత బాడిగ రామకృష్ణ మాట్లాడుతూ రతన్ టాటా విజయవాడ నగరానికి వస్తారని తనకు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని, ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టాటా గ్రూప్ ఉపాధ్యక్షుడు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications








