వరుసగా 11వ సారి కూడా వడ్డీ రేట్లను పెంచిన ఆర్బిఐ

నేడు జరిగిన రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి సమీక్షా సమావేశంలో ఆర్బిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆర్బిఐ తాజా వడ్డింపుతో రెపో రేటు (రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు) 7.5 శాతం నుంచి 8 శాతానికి మరియు రివర్స్ రెపో రేటు (డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేటు) 6.5 శాతం 7 శాతానికి పెరిగాయి. అయితే, సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో) లో మాత్రం ఎటువంటి మార్పు లేకుండా 6 శాతంగానే ఉంది.
కాగా.. భారతీయ రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 6 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2011 - మార్చి 2012)లో భారత ఆర్థికాభి వృద్ధిరేటు 8 శాతంగా నమోదవ్వచ్చని ఆర్బిఐ అంచనా వేసింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో.. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు తమ వడ్డీ భారాన్ని తగ్గించుకునేందుకు, ఆ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. దీంతో వాహన, గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి.


Click it and Unblock the Notifications








