ఆర్బిఐ వడ్డింపుతో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళన

ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పెరుగుతుంటే.. వాహన పరిశ్రమ వృద్ధి రేటు మాత్రం తగ్గుతుండటం గమనార్హం, ఇది కూడా పెరగాలని హోండా సియోల్ కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ అన్నారు. అలాగే, ఆర్బిఐ వడ్డీ రేట్ల పెంపుపై జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ స్పందిస్తూ.. ఈసారి రెపో రేటులో మార్పు ఉండదని భావించాం. కానీ ఆర్బీఐ ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. ఇప్పటికే కార్ల అమ్మకాల వృద్ధిరేటు తగ్గింది. తాజా పెంపు అమ్మకాలపై మరింత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.
దేశీయ అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా సిఎఫ్ఓ స్పందిస్తూ.. మార్కెట్ సెంటిమెంట్ ఇప్పటికే బలహీనంగా ఉంది. దీనికితోడు ఆర్బిఐ తీసుకున్న తాజా నిర్ణయంతో పెరిగనున్న బ్యాంకు వడ్డీ రేట్లు కొనుగోలుదారులను కార్లకు మరింత దూరం చేసే అవకాశం ఉందని చెప్పారు. వాస్తవానికి ఈ పండుగ సీజన్కు కార్ల అమ్మకాలు పెరగాల్సి ఉంది. అయితే, రిజర్వు బ్యాంక్ వడ్డీ వడ్డన కారణంగా కొత్త కారును కొనుక్కోవాలనుకు వారు వెనక్కు తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








