డస్టర్ ఎస్యూవీతో దుమ్ము లేపేందుకు సిద్ధమైన రీనాల్ట్

డస్టర్ ఎస్యూవీని పూర్తిగా భారత్లోనే తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వీలుగా భారత్ను ఎస్యూవీ కోసం ఎక్స్పోర్ట్ హబ్గా ఉపయోగించుకోనుంది. ఇలా ఎస్యూవీ కోసం భారత్ను ఎక్స్పోర్ట్ హబ్గా వాడుకోనున్న తొలి ఫారిన్ కంపెనీగా రీనాల్ట్ నిలువనుంది.
డస్టర్ ఎస్యూవీ భారత్లో తయారు చేయడం వలన దీని ధర కూడా తక్కువగా ఉండే ఆస్కారం ఉంది. దీని రూ.8 నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. మహీంద్రా అండ్ మహీంద్రా ఎంట్రీ లెవల్ ఎస్యూవీ అయిన బొలెరో, స్కార్పియోలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
డస్టర్ కోసం యూకేతో సహా కుడిచేతివైపు డ్రైవింగ్ కలిగిన అన్ని మార్కెట్లకు భారత తయారీ హబ్గా ఉండనుంది. డస్టర్ ఎస్యూవీ ఉత్పత్తి ప్రారంభించిన తొలి సంవత్సరంలో 50,000 ఉత్పత్తి చేయాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
రీనాల్ట్కు డస్టర్ ఎస్యూవీ భారత్లో మూడో ఉత్పత్తి మాత్రమే కాకుండా ప్రస్తుతం ఉన్న రెండు ఉత్పత్తుల కన్నా చవకైనది కానుంది. రీనాల్ట్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్ ధర రూ.14 లక్షలకు పైగా ఉంటే, తాజాగా మార్కెట్లోకి వచ్చిన ప్రీమియం ఎస్యూవీ కొలియోస్ ధర రూ. 22 లక్షలకు పైగా ఉంది.


Click it and Unblock the Notifications








