లక్ష కార్ల ఉత్పత్తిని సాధించిన రీనాల్ట్-నిస్సాన్

తమిళనాడులోని ఓరగడం ప్లాంటులో ఈ జేవీ తొలి లక్షల కార్ల ఉత్పత్తి మార్కును తాకింది. చెన్నైలో 2008 సంవత్సరంలో రీనాల్ట్ మరియు నిస్సాన్ కంపెనీలు రూ. 4,500 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటును నిర్మించాయి. గతేడాదిలో ఈ ప్లాంటులో కార్యకాలాపాలు పూర్థిస్థాయిలో ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా రీనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కోవు కిమురా మాట్లాడుతూ.. "గతేడాది మే నెలలో ఉత్పత్తిని ప్రారంభించాం. అప్పటి నుండి ఇప్పటికీ మేము ఓరగడం ప్లాంటు నుంచి లక్ష కార్లను ఉత్పత్తి చేయగలిగాం. ఇది భారత్లోనే అత్యంత వేగంగా లక్ష కార్ల ఉత్పత్తిని సాధించడమ"ని అన్నారు.
ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించిన 13 నెలల్లనే లక్ష కార్ల మార్కును ఈ జేవీ సాధించింది. ఈ ప్లాంటులో నిస్సాన్ మరియు రీనాల్ట్ సంస్థలకు చెందిన కార్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఇక్కడ నిస్సాన్ తన చిన్న కారు మైక్రాను ఉత్పత్తి చేస్తుండగా, రీనాల్ట్ తన లగ్జరీ కారు ఫ్లూయెన్స్ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








