త్వరలో మూడో షిఫ్టును ప్రారంభించనున్న రీనాల్ట్-నిస్సాన్ జేవీ

Renault Nissan
ఫ్రాన్స్ జపాన్‌లకు చెంది రెండు ప్రముఖ ఆటో దిగ్గజాలు రీనాల్ట్ మరియు నిస్సాన్ కంపెనీలు సంయుక్తంగా (జాయింట్ వెంచర్) ఏర్పడి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమిళనాడులోని ఓరగడం ప్లాంటులో త్వరలోనే మూడో షిఫ్టును ప్రారంభించనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్లాంటులో రెండు షిఫ్టులు నడుస్తున్నాయని, త్వరోనే మూడో షిఫ్టును ప్రారంభించనున్నామని, రానున్న వారాల్లో ఈ షిఫ్టు ప్రారంభం కావచ్చని రీనాల్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ నాసిఫ్ వెల్లడించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో మూడో షిఫ్టును ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ ప్లాంటులో రీనాల్ట్ మరియు నిస్సాన్‌లకు చెందిన ఉత్పత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్లాంటు ప్రారంభ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా రెండు లక్షల యూనిట్లు, భవిష్యత్తులో దీన్ని నాలుగు లక్షలకు పెంచనున్నట్లు నాసిఫ్ తెలిపారు. ఇటీవలే రీనాల్ట్ తమిళనాడులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించి, తమ లగ్జరీ సెడాన్ ఫ్లూయెన్స్ కారును విడుదల చేసింది. కాగా.. భారత్‌లో ఇది రీనాల్ట్‌కు 13వ షోరూమ్. నిస్సాన్ త్వరలోనే తమ 14వ షోరూమ్‌ను పూణేలో ప్రారంభించనుంది. డీజిల్ వేరియంట్‌లో లభించే ఫ్లూయెన్స్ లగ్జరీ సెడాన్ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ చెన్నయ్) మరియు పెట్రోల్ వేరియంట్ లగ్జరీ సెడాన్ ధర రూ. 14.40 లక్షలు (ఎక్స్-షోరూమ్ చెన్నయ్) గానూ ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 16, 2011, 11:18 [IST]
English summary
French carmaker Renault and Japanese auto gaint Nissan's JV Renault Nissan India will soon start its third shift at their Oragadam plant here to gear up its production capacity.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+