భారత్లో ఏటా వందకు పైగా కార్లను విక్రయిస్తాం..!!

ప్రస్తుతం భారత్లో రోల్స్ రాయింట్ ఫాంటమ్, గోస్ట్ అనే రెండు వేరియంట్ల లగ్జరీ కార్లను అందిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 2.5 కోట్లు, 3.5 కోట్ల పైమాటే. భారత విక్రయాలలో 2009లో పోలిస్తే 2010లో 600 శాతం వృద్ధిని సాధించామని, 2011 తమ కంపెనీ విక్రయాలు మూడంకెల సంఖ్యను అధిగమించవచ్చునని రోల్స్ రాయిస్ సీఈఓ టోర్స్టెన్ ముల్లర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా తర్వాత రోల్స్ రాయిస్ కంపెనీకు భారత్ రెండవ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్ కావడం విశేషం.
అంతేకాకుండా భారత్లో రెండు కొత్త డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం పంజాబ్, హైదరాబాద్ ప్రాంతాలను పరిశీలిస్తున్నామని ముల్లర్ తెలిపారు. మార్చి 1, 2011 నుంచి జెనీవాలో ప్రారంభం కానున్న జెనీవా మోటార్ షోలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ మోడల్లో తయారుచేసిన ఎలక్ట్రిక్ కారు '102 ఈఎక్స్'ను కూడా విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








