ఎక్సైజ్ సుంకాన్ని పెంచొద్దని ప్రణబ్‌కు యమహా విజ్ఞప్తి

Yamaha SZX
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం సరైన దారిలో పయనిస్తుందని, దేశీయ ఆటో పరిశ్రమ గతేడాది మార్కెట్ అంచనాలను మించి వృద్ధిని కనబరించిందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాల పెంపు విషయాన్ని యథాతథంగా ఉంచవచ్చునని యమహా మోటార్ ఇండియా బిజినెస్ హెడ్ రాయ్ కురియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. ఇంధన ధరలు నానాటికీ పెరిగుతున్నప్పటికీ, ఈ ఏడాది కూడా ఇదే జోరు కొనసాగాలంటే ఎక్సైజ్ సుంకాన్ని పెంచరాదని ఆయన సూచించారు.

ద్విచక్ర వాహన కొనుగోళ్లకు సంబంధించి రుణ లభ్యతపై దృష్టి పెట్టాలని, ఇందుకు సమంజసమైన వడ్డీరేట్లను ప్రతిపాదించాలని, ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. స్టీల్, అల్యూమినియం వంటి వాటిపై కస్టమ్స్ సుంకాన్ని కూడా పెంచవద్దని రాయ్ విజ్ఞప్తి చేశారు. వీటి ధరలు ఆటో రంగంపై మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనాల తయారీపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని తెలిపారు. యమహా మోటార్ ఇండియా ఇటీవల భారత స్కూటర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసింజే. ఈ అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని రాయ్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Sunday, February 27, 2011, 11:32 [IST]
English summary
Roy Kurian, India Business Head of Yamaha Motor has made some suggestions to the Finance Minister Pranab Mukherjee for the forthcoming Union Budget 2011-12 for the Automobile Sector. Yamaha has been contemplating to ride into the scooter segment in India and simultaneously the company’s Business Head has made some cry to the government here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+