దిగమతి సుంఖంపై రతన్ టాటా మర్చడానికి కారణం..!?

Ratan Tata
ఇటీవల ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జెడి పవర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ.. దిగుమతి సుంఖాలు ఇప్పటికే అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే రతన్ టాటా వాదనకు భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఆందోళనకు అస్సలు పొంతన కుదరడం లేదు. భారత్-యూరప్ దేశాల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని మన ప్రభుత్వం యోచిస్తుంది. ఇదే గనుక జరిగితే యూరప్‌లో తయారైన కార్లు భారత్‌లో లభించే కార్ల కంటే చౌకగా లభిస్తాయి. ఉదాహరణకు గతేడాది వరకూ మన మార్కెట్లలో సంచలనం రేపిన చైనా మొబైల్ ఫోన్ల మాదిరిగా అన్నమాట. అంటే ఈ ఒప్పందం విజయవంతమైతే, చౌక ధరకే అన్ని ఫీచర్లు కలిగిన యూరప్ కార్లు భారత మార్కెట్లలో లభిస్తాయన్నమాట.

ఒకవేళ ఇదే గనుక జరిగితే భారత ఆటోమొబైల్ పరిశ్రమపై తీవ్ర ఒత్తిడి పడే ఆస్కారం ఉంది. యూరప్ కార్లు భారత్‌లోకి ప్రవేశిస్తే.. మార్కెట్ పోటీని తట్టుకునేందుకు దేశీయ కంపెనీలు కూడా తప్పనిసరిగా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించాల్సి వస్తుంది. ఫలితంగా కంపెనీల మార్జిన్లు పడిపోయి దివాళా తీసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఈ ఒప్పందం వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే 110 శాతంగా ఉన్న దిగుమతి సుంఖాన్ని మరింత పెంచాలని అంటోంది. దీని వల్ల భారత్‌కు విదేశీ కంపెనీల వలస తగ్గి, దేశీయ కంపెనీలను రక్షించినట్లు అవుతుంది. మన దేశంలో దాదాపు అన్ని ప్రముఖ విదేశీ కంపెనీలకు ఉత్పత్తి కేంద్రాలు లేవు, కేవలం అసెంబ్లింగ్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇదే విషయాన్ని రతన్ టాటా కూడా స్పష్టం చేశారు.

అయితే రతన్ టాటా మాటలను బట్టి పరిశీలిస్తే.. టాటా గ్రూపు ఇటీవలే కొనుగోలు చేసిన బ్రిటన్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ (జేఎల్ఆర్)ను వెనకేసుకొస్తున్నట్లు తెలుస్తుంది. జేఎల్ఆర్‌ను టాటా గ్రూపు 2008లో కొనుగోలు చేసింది, ఆ సమయంలో అది దాదాపు సిక్ ఇండస్ట్రీగా మారిపోయిన పరిస్థితిలో ఉండేది. కానీ దీనిని టాటా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇది మార్కెట్ అంచనాలకు మించి వృద్ధి చెందుతూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తూ టాటా మోటార్స్‌కు విదేశాల్లో మరింత గుర్తింపు తెచ్చిపెడుతుంది. మరోవైపు ఈ బ్రాండ్‌కు మన దేశంలో కూడా భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ ఈ బ్రాండ్ వాహనాలను బ్రిటన్ నుంచి పూర్తిగా తయారైన యూనిట్లను కానీ లేదా విడిభాగాలుగా భారత్‌కు తెచ్చుకొని అసెంబ్లింగ్ చేసుకోవాల్సిందే తప్ప, పూర్తిగా భారత్‌లో తయారు చేసే ఆస్కారం లేదు.

కాబట్టి తమ బ్రిటన్ కార్లను భారత్‌కు రప్పించుకునేందుకు టాటా గ్రూపు ప్రభుత్వానికి భారీగా దిగుమతి సుంఖాలను చెల్లించాల్సి వస్తుండటంతో టాటా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని విమర్శకులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల జోరుకు చెక్ పెట్టాలంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్‌లో మరిన్ని మోడళ్లు భారత మార్కెట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

More from DriveSpark

Article Published On: Saturday, June 18, 2011, 17:08 [IST]
English summary
In an interview to the market research firm JD Power, Tata Groups chairman Ratan Tata said high import duties are unrealistic and create an artificial barrier of protection for local companies. But critics says, Tata's British unit Jaguar Land Rover is there behind his recent comments.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+