యూపి అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్: ఎస్ఐఎల్ అమ్మకం వాయిదా

స్కూటర్స్ ఇండియా కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న 95.38 శాతం వాటాలను వ్యూహాత్మక విధానం(అవుట్రైట్ సేల్)లో ఓ ప్రైవేట్ సంస్థకు విక్రయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపధ్యంలో దీనికి పార్లమెంటు నుంచి అనుమతి పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే 2012లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఐఎల్ విక్రయాన్ని రాజకీయం చేయకుండా ఉండేందు కోసం యపి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఈ విక్రయాన్ని వాయిదావేయాల్సిందిగా కోరినట్లు సమాచారం.
మొత్తం 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేసే స్కూటర్స్ ఇండియా కంపెనీ 2002-03 నుంచి నష్టాల్లో చిక్కుకుంది. 2009 మార్చిలో ఈ కంపెనీను ఖాయిలా పరిశ్రమగా (సిక్ ఇండస్ట్రీ)గా ప్రకటించి బోర్డ్ ఫర్ రికన్సోలేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (బిఆర్పిఎస్ఈ)కు రెఫర్ చేయడం జరిగింది. 1972లో ప్రారంభమైన స్కూటర్స్ ఇండియా కంపెనీ తొలుతగా దేశీయ మార్కెట్ కోసం విజయ్ సూపర్ బ్రాండ్ పేరుతో స్కూటర్లను అలాగే, విదేశీయ మార్కెట్ల కోసం లాంబ్రెట్టా పేరుతో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించింది. అనంతరం విక్రమ్ బ్రాండ్ పేరుతో త్రిచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించింది. కానీ.. 1997లో స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసి కేవలం త్రిచక్ర వాహనాల ఉత్పత్తికి మాత్రమే పరిమితమైంది.


Click it and Unblock the Notifications








