తృణమూల్ లబ్ధి కోసమే సింగూర్ బిల్లు: టాటా మోటార్స్

పశ్చిమ బెంగాల్లోని సింగూర్ ప్రాంతంలో తమ చిన్న కారు టాటా నానో ప్లాంటు ఏర్పాటు కోసం టాటా మోటార్స్కు కేటాయించిన భూములను తిరిగి రైతులకే ఇచ్చేయాలంటూ మమత సర్కారు పాస్ చేసిన ఈ బిల్లును సవాల్ చేస్తూ టాటా మోటార్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సింగూర్లో దాదాపు టాటా నానో కారు ప్లాంటు పూర్తయి ట్రైల్ ప్రొడక్షన్ను కూడా నిర్వహించిన తర్వాత సింగూర్ ప్రాంతంలో రేగిన కలకలం కారణంగా టాటా మోటార్స్ తన ప్రజల కారు ప్రాజెక్టును గుజరాత్లోని సనంద్కు మార్చుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎన్ని ఆటంకాలు తలెత్తినా టాటా మోటార్స్ వెనక్కు తగ్గకుండా కారును సొంతం చేసుకోవాలనుకునే సామాన్యుడి కలను నిజం చేస్తూ నానో కారును జీవం పోసింది.


Click it and Unblock the Notifications








