వాహనాలపై మైలేజ్ను తెలిపే రేటింగ్ విధానానికి శ్రీకారం!

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో సగటు వినియోగాదరుడి మెదడులో మొదటిగా మెదిలే ప్రశ్న మైలేజ్ ఎంత..? అని. ఈ మేరకు ఒక వాహనం యోక్క ఇంధన సామర్థ్యాన్ని సులువుగా తెలుసుకునేందుకు ఈ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబిలింగ్ రూల్స్ను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) దాదాపుగా ఖరారు చేసింది. మార్చి 2012 నుంచి వాహనాలపై ఫ్యూయెల్ ఎఫీషియన్సీ లేబుల్స్ను ప్రదర్శించడం తప్పనిసరిగా మారనుంది. ఇకపై కొత్త కార్లు ఈ లేబుల్ లేకుండా రోడ్లపై తిరగడానికి లేదు.
ఈ మైలేజ్ రేటింగ్ విధానం ద్వారా వాహనం యొక్క ఇంధన సామర్థ్యాన్ని తెలుసుకోవడంతో పాటు అదే రేంజ్లో ఉన్న ఇతర బ్రాండ్ వాహనాల యొక్క మైలేజ్ను సరిపోల్చుకొని మైలేజ్ విషయంలో ఏ వాహనం మంచిదో తెలుసుకోవచ్చు. ఈ రేటింగ్ విధానం వల్ల కంపెనీలు ప్రతిపాధించే మైలేజ్కు వాళ్లు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాలం చెల్లిపోయిన పాత ఇంజన్లకు ఇది స్వస్తి పలకనుంది. దీంతో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి ఇంజన్లను రూపొందించడం వ్లల భవిష్యత్తులో ఇంధనం ఆదా అవుతుంది.


Click it and Unblock the Notifications








