మారుతి ప్లాంటులో నాలుగో రోజుకు చేరిన వర్కర్ల సమ్మె

దాదాపు 2,000 మంది కార్మికులు గత శనివారం మధ్యాహ్నం నుంచి సమ్మె చేస్తున్నారు. సమ్మె కారణంగా నిన్నటి వరకూ కంపెనీ సుమారు 1,800 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయింది. దీని వల్ల కంపెనీకు దాదాపు వంద కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మానేసర్ ప్లాంటులో రెండు షిఫ్టుల ద్వారా కంపెనీ రోజుకు 1,200 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంటులో స్విఫ్ట్, ఏ-స్టార్ హ్యాచ్బ్యాక్ మోడళ్లను మరియు డిజైర్, ఎస్ఎక్స్4 సెడాన్ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. సమ్మె ప్రభావం కంపెనీ షేర్లపై పడుతోంది.


Click it and Unblock the Notifications








