ఆరవ రోజుకు చేరిన సమ్మె: నష్టం అంచనా రూ. 210 కోట్లు

Strike at Maruti Manesar Plant
అసలే వర్కర్ల సమ్మెతో తల పట్టుకొని కూర్చున్న మారుతి సుజుకి కంపెనీకు మరో తలనొప్పి ఎదురయ్యింది. మానేసర్ ప్లాంటు వర్కర్ల సమ్మెకు మద్దతు తెలుపుతూ, నేడు ప్లాంటు ఎదుట సత్యాగ్రహం చేయనున్నామని ఆల్‌ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రకటించింది. గుర్గావ్-మానేసర్ పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని ఫ్యాక్టరీల యూనియన్‌ల ప్రతినిధులు ఈ సత్యాగ్రహంలో పాల్గొంటారని ఏఐటీయూసీ గుర్గావ్ జిల్లా అధ్యక్షుడు సురేష్ గౌర్ తెలిపారు.

కాగా.. మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను యాజమాన్యం గుర్తించాలంటూ కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో ఆరవ రోజుకు చేరుకుంది. ఈ రోజు పరిస్థితి కూడా నిన్నటి మాదిరిగానే ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సమ్మె కారణంగా నిన్నటి వరకూ కంపెనీ దాదాపు 4,200 యూనిట్లను ఉత్పత్తి నష్టపోయినట్లు అంచనా. దీని విలువ సుమారు 210 కోట్ల రూపాయలు. గడచిన శనివారం నుంచి ఈ ప్లాంటులో సమ్మె కొనసాగుతుంది.

కార్మికుల డిమాండ్ల యాజమాన్యం కూడా ససేమిరా అంటోంది. వర్కర్ల డిమాండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కంపెనీ ఛైర్మన్ ఆర్‌.సి. భార్గవ గురువారం ప్రకటించారు. అంతకు ముందు వర్కర్లను రెచ్చగొట్టి సమ్మెకు ఉసిగొల్పారనే నెపంతో 11 మంది కార్మికులను కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Thursday, June 9, 2011, 11:49 [IST]
English summary
Country's largest car-maker Maruti Suzuki India (MSI) Manesar plant workers strike enters into the sixth day today and production also continues to be completely stopped. Due to workers strike Company losses about 4,200 units production till yesterday and the value of the loss is estimated to be around Rs 210 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+