మమత సర్కారుకు సుప్రీం షాక్.. సింగూర్ భూపంపిణీపై స్టే

Mamata Banerjee-Ratan Tata
సింగూర్ భూములు వివాదంలో టాటా మోటార్స్‌కు సుప్రీం కోర్టు ఊరట కలిగించింది. కమ్యూనిస్టు సర్కారు టాటా మోటార్స్ నానో ప్లాంటు కోసం సింగూర్‌లో కేటాయించిన భూములను తిరిగి రైతులకు పంచడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమగా బెనర్జీ ఆమోదించిన 'సింగూర్ ల్యాండ్ రిహాబిలేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 2011' బిల్లుపై దేశపు అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు భూపంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని మమత సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

నేడు సింగూర్ భూములను రైతులకు పంపిణీ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా తొలుత టాటా మోటార్స్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు టాటా మోటార్స్ పిటిషన్‌ను తిరస్కరించడంతో మంగళవారం సంస్థ తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సింగూర్ భూముల వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చి స్టే టాటా మోటార్స్‌కు తాత్కాలికంగా ఊరట కలిగించినట్లయింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 29, 2011, 12:20 [IST]
English summary
Tata Motors today got a much wanted relief from the Supreme Court of India. The apex court ordered the West Bengal Government not to return any piece of land at Singur to farmers until the Kolkota high court makes a decision. Tata Motors had sought maintenance of status quo at Singur.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+