లీటరు డీజిల్కు 40 కి.మీ. మైలేజ్ ఇవ్వనున్న 'నానో' డీజిల్ వేరియంట్!

ఇదే గనుక జరిగితే భారత్లోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుగా నానో రికార్డు సృష్టించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే టాటా ఈ కారును విడుదల చేసే అకాశాలున్నాయి. టాటా నానో ఇంజన్ను అభివృద్ధి చేయడంలో తోడ్పాటందించిన ప్రముఖ విడిభాగాల సంస్థ బోష్ ఇండియా అధికారి ఒకరు మాట్లాడుతూ.. నానో పెట్రోల్ వెర్షన్ కోసం టాటా మోటార్స్తో కలిసి పనిచేశామని, అలాగే డీజిల్ వెర్షన్ కోసం కూడా పనిచేస్తున్నామని చెప్పారు. డీజిల్ వేరియంట్ నానో కారు 700 సీసీ ట్విన్-సిలిండర్ ఇంజన్తో మైలేజ్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మంచి శక్తిని విడుదల చేస్తుందని, అయితే మైలేజ్ టెస్ట్ విషయాన్ని అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ ఇది ఒక లీటరు డీజిల్పై 40 కిలోమీటర్లు పరుగులు తీయగలదని అంచనావేస్తున్నామని చెప్పారు.
అంటే నానో కారులో ప్రయాణం ప్రతి కిలోమీటర్కు ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుందన్నమాట. ఈ కారు ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 15 లీటర్ల వరకూ ఉండే అవకాశం ఉంది. బజాజ్ పల్సర్ 180, టీవీఎస్ అపాచీ 180 వంటి మోటార్సైకిళ్ల ధరలను పరిశీలిస్తే, వీటి ధరలు దాదాపు 75,000 (ఎక్స్-షోరూమ్)లకు పైమాటే. పైగా ఇవి లీటరు పెట్రోల్కు కేవలం 40 కిలోమీటర్ల మైలేజ్ను ఇస్తాయి. ఈ బైక్లపై వెచ్చించే మొత్తానికి మరికొంత నగదును కలుపుకుంటే ఓ బుజ్జి కారును సొంతం చేసుకోవచ్చు. దుమ్ము, ధూళి, ఎండా, వానల నుంచి తప్పించుకొని హాయిగా కారులో ప్రయాణించవచ్చు. పైగా బైక్లో ఇద్దరికి మాత్రమే చోటు, కానీ కారులో నలుగురు కూర్చొని ఎంచక్కా వెళ్లొచ్చు. మద్యతరగతి ప్రజలకు ఇది టాటా అందిస్తున్న గొప్ప కానుక.


Click it and Unblock the Notifications








