శ్రీలంకలో నానో కారుకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్ల నిరసనలు!!

ఇందుకు కారణం ఏంటంటే.. శ్రీలంక కార్ మార్కెట్లోకి ప్రవేశించిన టాటా నానో ఆ వెంటనే శ్రీలంక టాక్సీ మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్రైవేట్ క్యాబ్ల కన్నా తక్కువ ధరకే రవాణా సేవలు అందిస్తుండటంతో ఆటోలకు ఆదరణ తగ్గి ప్రజలు సౌకర్యంగా ఉండే నానో టాక్సీ సర్వీసుల వైపు మక్కువ చూపుతుండటంతో ఆటోరిక్షాలు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. శ్రీలంక మార్కెట్లోకి నానోకు అనుమతివ్వకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా టాటా నానో కారు చక్రంపై ఆ దేశ అధ్యక్షుడు మహిందా రాజపక్సే చిత్రపటాన్ని అంటించి ఆటోరిక్షా డ్రైవర్లు వీధుల్లో ఊరేగించారు. నానో రాకతో వ్యాపారపరంగా నష్టపోతున్నామని ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయిస్ (ఎఫ్ఓఎస్ఈ) వాదిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకలో లభ్యమవుతున కార్లన్నింటిలోకెల్లా టాటా నానోనే అత్యంత చౌవకైనది. దీంతో ఎక్కువ మంది ఈ కారును టాక్సీలుగా ఉపయోగిస్తుండటంతో తమ జీవనోపాది దెబ్బ తింటోందని డ్రైవర్లు వాపోతున్నారు.


Click it and Unblock the Notifications








