అక్టోబర్ నుంచి మరింత ప్రియం కానున్న టొయోటా వాహనాలు

పెరుగుతున్న ముడి సరుకుల భారాన్ని వినియోగదారులపై మోపాలని టొయోటా నిర్ణయించింది. "అక్టోబర్ 1 నుండి ధరలను 1.5 శాతం నుండి 2 శాతం మేర పెంచుతాం. పెరుగుతున్న విడిభాగాల ధరలు మరియు యెన్ (జపాన్ కరెన్సీ) విలువ పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమ"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ వెల్లడించారు.
భారత్లో ఉత్పత్తి అవుతున్న అన్ని వాహనాల ధరలను పెంచుతామని ఆయన చెప్పారు. టికెమ్ ఇప్పటికే ఈ ఏడాది రెండు సార్లు (ఏప్రిల్, జులై) ధరలను మొత్తం 3 శాతం మేర పెంచింది. ఎతియోస్, కరోలా ఆల్టిస్ సెడాన్, ఫార్చ్యూనర్ ఎస్యూవీ మరియు ఇన్నోవా ఎమ్యూవీ మోడళ్లను టొయోటా భారత్లో ఉత్పత్తి చేస్తుంది. కాగా.. సెప్టెంబర్ 9న డీజిల్ ఎతియోస్ సెడాన్ మరియు డీజిల్ ఎతియోస్ లివాలను టొయోటా భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








