లగ్జరీ కారు 'లెక్సస్'ను భారత్కు తీసుకురానున్న టొయోటా

టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి నగాకవా మాట్లాడుతూ.. భారత్లో విస్తరణ కోసం కొత్త ప్రణాళికలను కంపెనీ పరిశీలిస్తోందని, ఇందులో భాగంగాగనే.. లెక్సస్ కారును భారత్కు తీసుకు వచ్చే అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. టొయోటాకు ఇండియా ఒక కీలక మార్కెట్ అని, భారత్లో తమ ప్రస్థానాన్ని పెంచుకునేందుకు అలాగే ఇక్కడి వినియోగదారులుక మరిన్ని ఉత్పత్తులు అందించే విషయాలపై దృష్టి సారించామని కంపెనీ ఎండి (సేల్స్ అండ్ మార్కెటింగ్) సందీప్ సింగ్ వెల్లడించారు.
భారత్లో కార్యకలాపాలు ప్రారంభించే అంశంపై టొయోటా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పష్టంగా ఉందని, ఈ విషయంలో తమ మార్కెట్ అధ్యయనం దాదాపుగా పూర్తయిందని, ఇక తుది నిర్ణయం మాత్రమే మిగిలి ఉందని కంపెనీ పేర్కొంది. భారత్లో ఆటోమొబైల్ కంపెనీలే ఇలా స్వతహాగా ఫైనాన్స్ సేవలు అందిస్తున్న వారిలో ఫోక్స్వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్డబ్ల్యూ కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా.. గురువారం దేశీయ మార్కెట్లోకి టొయోటా తమ అప్గ్రేడెడ్ సెడాన్ కారు కరోలా ఆల్టిస్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








